మౌనంలోంచి ప్రజ్వరిల్లే కంఠాగ్ని
నా రుధిరంలో కలిసినప్పుడే అనుకున్నా...,
నే పలికే తుది పలుకు నీవౌతావని.
నీ మౌనం ముసుగుపొరల్లో ఎముందో ఎవరికి తెలుసు..??
నిశ్సబ్ధపు పహారా నుండి తప్పించుకున్న నా మది ఊసులు
నీ హ్రుదయం చుట్టూ గస్తీ తిరుగుతున్నాయి..
ఆకాశంలో అక్షరజ్ఞానం ఎప్పుడు మొదలైందో గానీ..
ప్రతిచొటా నీ పేరే దర్శనమిస్తోంది..
అవును.
నీ జ్ఞాపకాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
నిసీధి నీడల్లొ వెంటాడిన నీ అనుభూతులు
ఇంకా నా మదిలొతుల్ని స్ప్రుశిస్తూనే ఉన్నాయి.
నా ప్రతీ నిశ్శబ్ధం ఇపుడు నీ అలొచనలమధ్యే
నలుగుతోంది..
ఇపుడు కాలం వేదమయమైపొయింది..
గవాక్షాల ఊచల్లొంచి ఎంతకాలం అలా తొంగిచూస్తావు..
నమ్మకాల్ని ఆధారం చేసుకొని నాలుగడుగులు వెయ్యొచ్చుగా..
అయినా,
నిశీధి నీడల్ని ఎప్పుడు తనివితీరా చూశావుగనుక
నన్నర్థం చెసుకొడానికి.
నీ మౌనం నన్ను దహిస్తూందని తెలీదూ..??
అంతకంతకూ పెరిగిపోతున్న ఆవేదనలమధ్య
చివరకు నేనో మ్రుతసముద్రమవుతున్నాను..
అవును..
ఇపుడు నేనొక నిషిద్ధ ప్రేమాలజీ....!!
No comments:
Post a Comment